Thursday, February 17, 2011

SORRY PM



ఇటీవల కాలంలో ఎలక్ట్రానిక్‌ మీడియాలో వస్తున్న కుంభకోణాల శరపరంపరను తిప్పికొట్టడానికి అన్నట్టుగా దేశ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రముఖ టెలివిజన్‌ ఛానెళ్ల ఎడిటర్లతో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కానీ ఆర్థికరంగంలో తలపండిపోయిన మన్మోహన్‌ జీ- ఇంకా రాజకీయంలో ఎదగలేదని ఆయన వైఖరి స్పష్టమైంది. నిజమే- ఒక ఆర్థిక వేత్త, నిజాయితీపరుడికి రాజకీయం చేతకాదు. సొంతపక్షం చేతిలో కీలుబొమ్మగా మారిన మన్మోహన్‌- అటు సంకీర్ణంలోని భాగస్వామ్యపక్షాలనూ అదుపు చేయడంలో విఫలమవుతున్నారు. అదే- ఇపుడు దేశం పాలిట, ప్రజల పాలిట శాపమైంది.

ఎడిటర్లు సంధించిన ప్రశ్నలకు ప్రధాని జవాబు చెప్పలేక నీళ్లు నమలాల్సి వచ్చింది. టీవీలో మీడియా కాన్ఫరెన్స్‌ను చూసినవారికి ఇది గుర్తే ఉంటుంది CNN-IBN బాస్‌ రాజ్‌దీప్‌ సర్‌దేశాయ్‌ అడిగిన ప్రశ్నకు మన్మోహన్‌ నీళ్లు తాగాల్సి వచ్చింది. తన వల్ల తప్పులు జరుగుతున్నాయని అంగీకరించిన ప్రధాని- మొత్తం అవినీతికి తానే దోషిని అంటే కరెక్ట్‌ కాదన్నారు. మీడియా అత్యుత్సాహం వల్ల- మొత్తం భారతావని అవినీతి కూపంగా మారిందన్న అభిప్రాయం కల్పించే యత్నం కలుగుతోందని వాపోయారు. యూపీఎ-2 హయాంలో వెలుగులోకి వచ్చిన కుంభకోణాలను ప్రస్తావిస్తూ- అంతా పారదర్శకంగానే జరిగినట్టు తనవారిని వెనకేసుకొచ్చారు.

అసలు ప్రధాని ఏం చెప్పదల్చుకున్నారు? సంకీర్ణ సర్కారు ఉంటే- అవినీతి జరుగుతుందా? కళ్ల ముందే వేల కోట్లు ఎగరేసుకుపోతున్నా మన నిఘా సంస్థలు కళ్లు మూసుకోవాలా? ప్రభుత్వానికి ఇబ్బంది రావద్దు కాని- ప్రజల సొమ్ము లూటీ కావ ల్సిందేనా? ఇదేం న్యాయం? ఎవడబ్బసొమ్మని ఈ రాజకీయ రాబందులు- లాబీయిస్టులు, పారిశ్రామికవేత్తల  వైట్‌ కాలర్‌ నేరాలు జరగాల్సిందేనా? కొంతమంది ఘనులు ఈ దేశాన్ని దోచుకుంటే మనం చూస్తూ ఉండిపోవాల్సిందేనా?  I PITY MY COUNTRY.

0 comments:

Post a Comment