Saturday, February 26, 2011

CHILDREN POETS


నిజంగానే- వారిద్దరు మహనీయులు. ఇద్దరూ వారి రచనలతో ప్రజలను రంజింపజేశారు. ఒకరు అనంత్‌ పాయ్‌, రెండోవారు ముళ్లపూడి. కొద్దిగంటల తేడాలో ఇద్దరూ మరణించడం చాలా ఆవేదనకు గురిచేసంది.


అంకుల్‌ పాయ్‌గా చిరపరిచితుడైన అనంత్‌- తన కామిక్స్‌తో ఓ విప్లవానికి నాంది పలికారు. ఆయన రచించిన అమర్‌చిత్రకథలు- అన్ని భాషల్లోకి అనువదించారు. తద్వారా పిల్లలకు మన ప్రాచీన, పౌరాణిక, ఆధ్యాత్మిక, చరిత్రాత్మక విశేషాలన్నీ తెలిశాయి. చక్కటి బొమ్మలతో, అర్థమయ్యే పదజాలంతో ఆయన రచనలు గొప్ప ఖ్యాతినార్జించాయి. దూరదర్శన్‌  ఏర్పాటు చేసిన ఓ క్విజ్‌ కార్యక్రమంలో పిల్లలకు భారత పురాణాల పట్ల ఎలాంటి అవగాహన లేదని తెలుసుకున్న ఆయన అమర్‌ చిత్ర కథలకు పూనుకోవడం చిన్నారులు చేసుకున్న భాగ్యం అనుకోవాలి. అలాగే టింకిల్‌ పేరిట పిల్లల కోసమే మరో కామిక్స్‌ సిరీస్‌ను ఆరంభించారు. ఈ రెండు దేశంలో ఎంతో ప్రసిద్ధిగాంచాయి.



ఇక మన ముళ్లపూడి గురించి నేను ఏం చెప్పగలను. బాపు-రమణలది విడదీయరాని జంటగా ఉండేది. ఒకరు శరీరమైతే- మరొకరు ఆత్మగా ఉండేవారు. ఆయన సాహిత్యంలో అన్నీ ఉండేవి. సినిమా కథలు, నవలలు, హాస్యరచనలు, సంభాషణలు... ఇలా అన్ని వర్గాల వారికి కావల్సినంత విందును, వినోదాన్ని పంచిపెట్టారాయన. సినిమాలలో ఆయన రచనా శైలిని మెచ్చుకోని వారు లేరు. ముత్యాలముగ్గులోని డైలాగ్స్‌- ఇప్పటికీ గుర్తున్నాయి. బుడుగు హాస్యరచనలు ముళ్లపూడికి ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. చిన్నారులను అలరించాయి. అంకుల్‌ పాయ్‌లాగే రమణ కూడా పిల్లల కోసం ఎంతో శ్రద్ధతో రచనలు చేసేవారు. పిల్లల కోసం ఆలోచించిన ఇద్దరు మహనీయులు మనమధ్య నుంచి వెళ్లిపోవడం బాల్యప్రపంచానికి తీరని లోటు.

0 comments:

Post a Comment