Thursday, February 10, 2011

స్కాముల సర్కారు...


.

యూపీఏ-2 ప్రభుత్వం నిజంగానే- మన్మోహన్‌ సింగ్‌ లాంటి మేధావికి చేటు తెచ్చింది. చిన్నాచితకా భాగస్వామ్యపార్టీలతో సర్కారు ఏర్పాటు చేయడం వల్ల- మన ప్రధాని మౌనంగా అన్నీ భరిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అవినీతి భాగోతం- ఆయనకు తెలిసే జరుగుతోందని కొంద రు, ఆయనకు సంబంధం లేదని ఇంకొందరు వాదించవచ్చు గాక... కానీ ప్రధానమంత్రికి తెలిసి జరిగినా... తెలియక జరిగినా... ఇండియాలో ప్రస్తుతం స్థితి ఏమంత బాగోలేదు. ప్రధాన మంత్రి కార్యాలయం, నిఘా సంస్థలు, రాజకీయ పార్టీలు, శాసనకర్తలు, ఎగ్జిక్యూటివ్‌... వగైరా వగైరా! కానీ ఏం లాభం జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 2జీ స్కాం, 3జీ స్కాం, లేటెస్ట్‌గా 4జీ స్కామ్‌... ఇదంతా ప్రభుత్వ అవినీతిని ఎత్తిచూపుతున్నాయి.

ఇక, సోనియా జీ అంతరంగం ఏమిటో అంతుబట్టడం లేదు. ఆమె తన కొడుకు రాహుల్‌ను ఒకవైపు ప్రధాని చేయాలని కలలు కంటున్నారు. కానీ యూపీఏ-2 ప్రభుత్వాన్ని మాత్రం అవినీతికూపం నుంచి బయటపడవేయలేకపోతున్నారు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌, ఆదర్శ్‌ కుంభకోణాలు మీడియా చలవతోనే బయటపడ్డాయి.

నాకు అనిపిస్తుంది... భారతంలో సమర్థులైన జర్నలిస్టులు లేకపోతే- ఈ నేతలు, అధికారులు కలిసి- ఇండియానే స్విస్‌ బ్యాంకులో తాకట్టు పెట్టేవారేమో?    LONG LIVE JOURNALISM.

0 comments:

Post a Comment