Sunday, January 23, 2011

BLACK MONEY



ఎవడబ్బ సొమ్ము...
నల్లధనం... నల్లధనం... ఇపుడు ఎవ్వరి నోట విన్నా ఇదే మాట! ఎవ్వర్ని కదిపినా... దీని గురించిన చర్చలే వినిపిస్తాయి. అంతలా మన రాజకీయ రాబందులు దేశాన్ని దోచుకున్నాయి. కాదు కాదు... బడుగు బలహీనవర్గాల పొట్టగొట్టి ప్రజాధనాన్ని సరిహద్దులు దాటించాయి. దీని గురించి రాజకీయ పక్షాలు పెద్దగా మాట్లాడవు. ఎందుకంటే- అందరూ ఒక్కతాను ముక్కలే కదా! ఇప్పటికైనా మించిపోయింది లేదు. స్విస్‌ ప్రభుత్వాన్ని ఒప్పిస్తారో... గంగలో దూకుతారో తెలియదు కానీ... మన డబ్బు మనకు చెందాలి. ఎవరో అన్నారు. స్వాతంత్య్రం రాకమునుపే ఈ నల్లధనం విదేశాలకు వెళ్లడం ఆరంభమయిందట. ఉండవచ్చు.

దేశంలోని బడాబాబులు ఎవరైతే ఉన్నారో... వారంతా దొరికింది దొరికినట్టు దోచుకున్నారు. దేశాన్ని సర్వనాశనం చేశారు. వారికి శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థలు అండదండగా ఉండటంతో- ఆడిందే ఆట... పాడిందే పాట అయ్యింది. 20 లక్షల కోట్లు కాదు... దానికి ఎన్నో రేట్ల నల్లధనం దేశం దాటివెళ్లిపోయింది. సుప్రీంకోర్టు చురకలు వేసినా... కేంద్రంలో ఉలుకు పలుకు లేదు. అంతర్జాతీయ ఒప్పందాల మేరకు, పేర్లు బయటపెట్టడం సాధ్యం కాదని స్వయంగా ప్రధాని ప్రకటించడం సిగ్గుచేటు కాక మరేమిటి?

0 comments:

Post a Comment